బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పెరగడంతో ధర రికార్డు స్థాయికి చేరింది. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పది గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర రూ.42,339కి చేరుకుంది. ముందు రోజుతో పోల్చితే రూ.462 పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ఒక్క రోజులో రూ.1,047 మేర ఎగబాకి రూ.48,652కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయిలో అంటే.. ఏడేళ్ల గరిష్ఠంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కరోనా వైరస్ మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దాని ఫలితంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి రేట్లు పుంజుకున్నాయి. అదీకాక.. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండటంతో ఆభరణాల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. దీంతో రేట్లు కూడా పెరిగిపోయాయి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.